‘శంబాల’ ప్రీమియర్లను చూసిన వారంతా తాను పోషించిన దేవి పాత్రను చూసి షాక్ అవుతున్నారని, ప్రేక్షకులందరూ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతికిలోనవుతున్నారని చెప్పింది చిత్ర కథానాయిక అర్చన అయ్యర్. ఆది సరసన ఆమె నటించిన మిస్టిక్ థ్రిల్లర్ ‘శంబాల’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా బుధవారం కథానాయిక అర్చన అయ్యర్ చిత్ర విశేషాలను పంచుకుంది.
తాను అచ్చమైన తెలుగమ్మాయినని, పుట్టింది చిత్తూరులో..విద్యాభ్యాసం మొత్తం బెంగళూరులో జరిగిందని చెప్పింది. “శంబాల’ చిత్రంలో నేను దేవి అనే పాత్రలో కనిపిస్తా. ఎన్నో సవాళ్లతో కూడుకున్న పాత్ర అది. ప్రీమియర్స్ చూసిన చాలా మంది నన్ను అభినందిస్తున్నారు. ఇలాంటి సినిమాల్ని థియేటర్లో చూస్తేనే థ్రిల్. నా కెరీర్లో దేవిలాంటి పాత్ర మళ్లీ రాదనుకుంటున్నా. మంచి కథల్ని ఎంచుకుంటూ ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనుంది’ అని చెప్పింది.