యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో ఎన్టీఆర్ మనీతో పాటు మనసులు కూడా గెలుచుకోవచ్చు.. కథ మీది, కల మీది ఆట నాది కోటి మీది. రండి గెలుద్దాం ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు.
సక్సెస్ ఫుల్గా సాగుతున్న ఈ షో చివరి దశకు చేరుకుంది. ఈ సీజన్ ను నవంబర్ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్ లో మహేష్ బాబు(Mahesh Babu) కనిపించబోతున్నాడు. ఇప్పటికే మహేష్ బాబుకి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కాగా, ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ఒకటి లీకైంది. ఈ ఇద్దరు ఒకేసారి ఒకే షోలో కనిపించడం అంటే రేటింగ్స్ ఓ రేంజ్లో ఉంటాయని అంటున్నారు నెటిజన్స్.
ఇక ఇదే షోను గతంలో నాగార్జున, చిరంజీవి(chiranjeevi) ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ మాటీవీలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అదే షోను జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో ప్రసారం చేస్తుంది. ఈ షోలో రామ్ చరణ్(Ram charan), సమంత,రాజమౌళి,కొరటాల శివ వంటి సెలబ్స్ సందడి చేసిన విషయం తెలిసిందే.