విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎనిమి’. ఆనంద్ శంకర్ దర్శకుడు. వినోద్కుమార్ నిర్మాత. మృణాళిని రవి, మమతా మోహన్దాస్ కథానాయికలు. దసరా సందర్భంగా అక్టోబర్లో సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ప్రాణ స్నేహితుడితోనే ఓ యువకుడికి ఎందుకు శత్రుత్వం ఏర్పడింది? ప్రమాదకరమైన ఆ శత్రువును ఎదుర్కోవడానికి అతడు ఎలాంటి పోరాటం సాగించాడన్నది ఆకట్టుకుంటుంది. విశాల్, ఆర్య పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వారిపై తెరకెక్కించిన యాక్షన్ ఘట్టాలు అలరిస్తాయి’ అని తెలిపారు. ప్రకాష్రాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.