సుదీర్ఘ విరామం తర్వాత కెరీర్ను మళ్లీ నిర్మించుకునే పనిలో పడ్డారు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. వరుసగా రొమాంటిక్ సినిమాలు చేయడం అతనికో ప్రత్యేక ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ ఇమేజ్ను దాటేందుకు కొన్ని వైవిధ్యమైన చిత్రాల్లోనూ నటించారాయన. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లాంటి కెరీర్ మొదలుపెట్టారు. అక్షయ్ కుమార్తో కలిసి ‘సెల్ఫీ’ చిత్రంతో పాటు సల్మాన్ ఖాన్తో ‘టైగర్ 3’ సినిమాలో నటిస్తున్నారు. టైగర్ సిరీస్లో వస్తున్న మూడో చిత్రమిది. ఇందులో విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించబోతుండటం విశేషం. ఇక తాజాగా ఆయన సైనిక అధికారి పాత్రలో ఓ సినిమాలో నటించబోతున్నారు. ‘గ్రౌండ్ జీరో’ పేరుతో ఈ సినిమాను ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్నది. కల్లోల కాశ్మీర్లో శాంతిని నెలకొల్పేందుకు వెళ్లిన ఓ సైనికుడి పాత్రను ఆయన పోషించనున్నారు. మరాఠీ ఫిల్మ్ మేకర్ తేజస్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.