వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కతున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటిస్తున్నారు. కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడు. బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉంది.
శనివారం ఈ సినిమా ఫస్ట్లుక్, టైటిల్ని ప్రముఖ దర్శకుడు మారుతి లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ప్రశాంత్ అంకిరెడ్డి, సంగీతం: శ్రీవసంత్.