Dragon |మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ , మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “డ్రాగన్” . కొద్ది రోజులు బ్రేక్ తీసుకున్న చిత్ర బృందం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మాస్ ప్రాజెక్ట్ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూళ్లు పూర్తయ్యాయి. లీకైన ఔట్పుట్ చూసి ఫ్యాన్స్లో భారీ ఆసక్తి నెలకొంది. మొదట “డ్రాగన్” సినిమాను ఒకే భాగంగా తెరకెక్కించాలని అనుకున్న మేకర్స్, ఇప్పుడు రెండు పార్ట్స్గా ప్లాన్ చేసినట్టు సమాచారం. కథలో ఉన్న కంటెంట్ను దృష్టిలో ఉంచుకుని, రెండు భాగాలుగా తీసిన కూడా సినిమాకు నష్టం ఉండదని యూనిట్ భావిస్తోందట.
ఇక, ప్రశాంత్ నీల్కి రెండు భాగాల సినిమాలపై ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన “కేజీఎఫ్” ఫ్రాంచైజీ రెండు భాగాలుగా వచ్చి భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ప్రభాస్తో చేసిన “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్” కూడా మంచి హిట్గా నిలిచింది. అయితే సీక్వెల్ “సలార్ 2: శౌర్యాంగ పర్వం” ఇంకా సెట్స్ మీదకు రాలేదు. కానీ, ఎన్టీఆర్తో వస్తున్న “డ్రాగన్” మాత్రం రెండు భాగాలుగా ఒకేసారి షూట్ జరుపుకొని, తక్కువ గ్యాప్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే మొదటి భాగం తర్వాత రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఉంటుందని తెలుస్తోంది.ఇక సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకమైన హైలైట్గా నిలుస్తుందని టాక్. ఈ చిత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతుందని యూనిట్ చెబుతోంది.
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ కోసం సరైన ముహూర్తం చూసి స్ట్రాటజీ సిద్ధం చేస్తోందట టీమ్. ఇక మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో కూడిన ఈ చిత్రం, విడుదలయ్యే సమయానికి పాన్ ఇండియా లెవెల్లో భారీ హంగామా సృష్టించబోతోందని సినీ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ , హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ రుక్మిణి వసంత్ కాంబినేషన్ నుంచి వస్తున్న “డ్రాగన్” సినిమా నిజంగా ఫ్యాన్స్కి డబుల్ ఫీస్ట్ ఇవ్వబోతోందనే అంచనాలు ఉన్నాయి.