శ్రీసింహా కోడూరి, ప్రీతి అస్రానీ జంటగా నటిస్తున్న సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డి.సురేష్ బాబు, తాటి సునీత నిర్మాతలు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ త్రిపుర మాట్లాడుతూ…‘దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నాం. తెలుగులో తొలిసారి సర్వైవల్ థ్రిల్లర్ కథతో సినిమాను తెరకెక్కించాం. ఒకే లొకేషన్లో 72 మంది నటీనటులతో 342 గంటల్లో మొత్తం చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలోనే చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : గ్యారీ బీహెచ్, సంగీతం : కాలభైరవ, సినిమాటోగ్రఫీ : యశ్వంత్ సి.