Junior NTR | టాలీవుడ్ స్టార్ హీరోలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు.. అందరూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నింటినీ తమ సినిమాల కోసం బాగా వాడుకుంటారు. అప్పుడప్పుడు అభిమానులతో కూడా ముచ్చటిస్తూ ఉంటారు. తమ సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వాళ్లతో పంచుకుంటూ ఉంటారు. అందుకే మన హీరోలకు మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు.
ఎన్టీఆర్ సినిమా విడుదలై దాదాపు నాలుగేళ్లు అవుతోంది. 2018లో చివరి సినిమా విడుదల చేసిన జూనియర్ ఎన్టీఆర్.. తర్వాత రాజమౌళి దగ్గర లాక్ అయిపోయాడు. జక్కన్న దర్శకత్వంలో వహించిన ట్రిపుల్ ఆర్ సినిమా 2020 లో విడుదలవుతుంది అనుకుంటే 2022 వరకు వాయిదా పడుతూ వచ్చింది. దాంతో జూనియర్ కెరీర్లోనే అత్యధిక గ్యాప్ వచ్చేసింది. అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులకు చేరువగా ఉన్నాడు. అందుకే ఈయనను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లు మిలియన్లలో ఉన్నారు. ఎన్టీఆర్ ట్విట్టర్ ఫాలోవర్స్ దాదాపు 57 లక్షలు అంటే 5.7 మిలియన్ ఫాలోవర్స్ అన్నమాట. తారక్ ను ఇంత మంది ఫాలో అవుతున్నారు కానీ ఆయన మాత్రం ఇన్నేళ్లుగా కేవలం ఒకే ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నాడు. ఆయనెవరో తెలుసా.. దర్శక ధీరుడు రాజమౌళి.
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఈ రోజు ఇంత స్థాయిలో ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం రాజమౌళి. కెరీర్ మొదట్లో స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి సినిమాలతో ఎన్టీఆర్ మార్కెట్ భారీగా పెంచేశాడు రాజమౌళి. ఆ తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో యమదొంగ సినిమా చేసి మరోసారి ట్రాక్ ఎక్కించాడు. అందుకే తన కెరీర్లో రాజమౌళికి ప్రత్యేక స్థానం కల్పించాడు తారక్. అలాగే ట్విట్టర్లో కూడా కేవలం ఆయనొక్కడినే ఫాలో అవుతున్నాడు.