అగ్ర కథానాయిక సమంత అస్వస్థతకు గురైంది. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆమె చికిత్స కోసం సోమవారం ఉదయం హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాధారణ వైరల్ ఫీవర్గా నిర్దారించి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే సమంత తీవ్ర అనారోగ్యం పాలైందని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్ని ఆమె వ్యక్తిగత సహాయకులు ఖండించారు. సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని..దగ్గు ఇబ్బందిపెడుతుండటంతో ఆసుపత్రికి వెళ్లి వచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారని..ఆమె ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దని సమంత పర్సనల్ సిబ్బంది కోరారు. ఆదివారం సమంత ఏపీలోని కడప నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అనంతరం అక్కడి పెద్ద దర్గాను సందర్శించారు. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఆమె స్వల్ప జ్వరం, దగ్గు లక్షణాలతో అస్వస్థతకు గురైంది.