DJ Tillu | కరోనా ఉధృతి తగ్గటంతో వాయిదా పడ్డ సినిమాలతో పాటు కొత్త సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. తాజాగా మాస్మహారాజ రవితేజ నటించిన ఖిలాడితో పాటు సెహరి, ఎఫ్ఐఆర్ సినిమాలు విడుదయ్యాయి. ఇక శనివారం డీజే టిల్లు విడుదల కానుంది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విమల్ కృష్ణ దర్వకత్వం వహించాడు. సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం.
ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.70 కోట్లు జరిగిందట. ఇక ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.25 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. ఇక మొత్తం కలిపితే 8.95 కోట్ల ఓవరాల్ థియేట్రికల్ బిజినెస్ జరిగిందన్న మాట. ఈ చిత్రం క్లీన్ హిట్ సాధించాలంటే 9 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుందట. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ను సాధిస్తుందని ట్రేడ్ పండితులు చెప్పుతున్నారు. గుంటూరు టాకీస్, కృష్ణ ఆండ్ ఈజ్ లీలా వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సిద్దూ జొన్నలగడ్డ. ఈయన నటించిన గత రెండు సినిమాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి.