సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ సినిమా మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. దీనికి ‘టిల్లు స్కేర్’ టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. సీక్వెల్లో రెట్టింపు వినోదాన్ని అందించబోతున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నది.
ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయనున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్, సంగీతం : రామ్ మిరియాల.