Vakeel Saab | పవన్కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందిన ‘వకీల్సాబ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హిందీ ‘పింక్’ రీమేక్గా తెరకెక్కించిన ఈ సినిమా భావోద్వేగభరితమై కోర్ట్ రూమ్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ సినిమా విడుదలై రెండేండ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా పవన్కల్యాణ్ అభిమానులతో దర్శకుడు వేణుశ్రీరాం ట్విట్టర్ ద్వారా ముచ్చటించారు. ‘వకీల్సాబ్’ చిత్రానికి సంబంధించిన సీక్వెల్కు స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని తెలిపారు. అంతా సిద్ధమయ్యాక మరిన్ని వివరాల్ని వెల్లడిస్తానన్నారు. ‘వకీల్సాబ్’ చిత్రాన్ని థియేటర్స్లో రీరిలీజ్ చేయబోతున్నామని పేర్కొన్నారు. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల, ప్రకాష్రాజ్, శృతిహాసన్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్ని పోషించారు.