‘ఈ కథ ఎవరికి చెప్పాలా? అని ఎదురు చూస్తున్న సమయంలో ‘90s’ సిరీస్ చూశాను. అందులో శివాజీని చూస్తే మా నాన్న గుర్తొచ్చారు. ఈ కథ ఆయనకెందుకు చెప్పకూడదు?! అనిపించి, వెళ్ల్లి చెప్పాను. కథ విని, తానే ప్రొడ్యూస్ చేస్తానన్నారు. టైటిల్ ఆయనే సజెస్ట్ చేసి, కథను ఈటీవీ విన్ వారికి కూడా వినిపించమన్నారు.
అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు దర్శకుడు సుధీర్ శ్రీరామ్. ఆయన దర్శకత్వంలో శివాజీ, లయ జంటగా రూపొందిన క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’. శివాజీ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఈటీవీ విన్తో కలిసి బన్నీవాస్, వంశీ నందిపాటి సమర్పిస్తున్నారు. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో దర్శకుడు సుధీర్ శ్రీరామ్ విలేకరులతో ముచ్చటించారు. ‘దర్శకుడు నెల్సన్ సినిమాల తరహాలో డార్క్ కామెడీతో థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ఇది నాకిష్టమైన జానర్. ఫన్, ఎమోషన్తో కూడిన ఈ సినిమా కుటుంబ సమేతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని నమ్మకంగా చెప్పారు సుధీర్ శ్రీరామ్.