పానిండియా బ్లాక్బస్టర్ ‘హను-మాన్’కి సీక్వెల్గా దర్శకుడు ప్రశాంత్వర్మ తెరకెక్కించనున్న పానిండియా ఫిక్షన్ డ్రామా ‘జై హనుమాన్’. ‘కాంతారా’ఫేం రిషబ్శెట్టి ఇందులో ఆంజనేయునిగా కనిపించనున్నారు. కొన్ని నెలల క్రితం హనుమంతుడిగా ఆయన లుక్ని కూడా విడుదల చేశారు. దీంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
గత రెండేళ్లుగా రిషబ్శెట్టి ‘కాంతారా 2’ షూటింగ్లో బిజీగా ఉండటంతో ఈ సినిమా సెట్స్కి వెళ్లడం కుదర్లేదు. ఈలోపు దర్శకుడు ప్రశాంత్వర్మ పకడ్బందీగా స్క్రిప్ట్ వర్క్ని పూర్తి చేశారు. సాయిమాధవ్ బుర్రా మాటలు రాయగా, బౌండ్ స్క్రిప్ట్ సిద్ధమైంది. గత ఏడాది అక్టోబర్లో ‘కాంతారా 2’ కూడా విడుదల కావడంతో, రిషబ్ ‘జై హనుమాన్’ షూటింగ్ని ఎప్పుడు షురూ చేస్తారా? అని ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూశారు.
ఎట్టకేలకు ఆ శుభఘడియ రానే వచ్చింది. ‘జై హనుమాన్’ పట్టాలెక్కించడానికి సన్నాహలు మొదలయ్యాయి. మార్చి 22న పుణ్యక్షేత్రం హంపిలో ‘జై హనుమాన్’ షూటింగ్ లాంఛనంగా మొదలుకానుంది. ఆద్యంతం హనుమంతుడి నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందని సమాచారం. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.