‘ఇంటర్పోల్ ఆఫీసర్ విక్రమ్ లక్ష్యంగా అండర్వరల్డ్ అంతా ఏకమవుతుంది. అతన్ని అంతమొందించడానికి కుట్ర పన్నుతారు. ఆ సమయంలో ప్రత్యేకమైన ఉక్కుతో తయారుచేసిన ఖడ్గాన్ని తయారుచేస్తాడు విక్రమ్. దాని సహాయంతో అండర్వరల్డ్ను ఎలా తుదముట్టించాడన్నది ఉత్కంఠను పంచుతుంది’ అన్నారు ప్రవీణ్ సత్తారు.
ఆయన దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ఘోస్ట్’. నారాయణ్దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్మరార్ నిర్మాతలు. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం చిత్ర ప్రోమోను విడుదల చేశారు. దీనిలో ఇంటర్పోల్ ఆఫీసర్ విక్రమ్ ఉపయోగించే అరుదైన కత్తి తాలూకు ప్రాముఖ్యతను చూపించారు.
తమహాగానే పేరుతో జపనీస్ సంప్రదాయ యుద్ధ విద్యలో ఈ కత్తిని ఉపయోగిస్తారని దర్శకుడు తెలిపారు. ఈ నెల 25న థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. సోనాల్చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్.జి, సంగీతం: మార్క్ కె రాబిన్, నిర్మాణ సంస్థలు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.