కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశికుమార్ దర్శకుడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. కార్తీక మురళీధరన్ కథానాయిక. శుక్రవారం ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. ప్రేమికుల మధ్య సరదా సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది.
విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఫీల్గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఓ జంట ప్రేమ పయనంలోని జ్ఞాపకాలకు అద్దం పడుతుంది. చక్కటి వినోదంతో మెప్పిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: ర్యాంపీ నందిగాం, సంగీతం: కార్తీక్.