Dil raju IT raids | గత మూడు రోజులుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోదాల్లో భాగంగా ఇప్పటికే ఐటీ అధికారులు దిల్ రాజుతో పాటు అతడి భార్యను విచారించడంతో పాటు వారి బ్యాంక్ వివరాలను అడిగినట్లు సమాచారం. అయితే గత మూడు రోజులుగా జరుగుతున్న దాడి నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురయ్యింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐటీ శాఖకు సంబంధించిన వెహికిల్లోనే ఆమెని హాస్పిటిల్కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వీరితో పాటు ఐటీ శాఖకు సంబంధించిన మహిళా అధికారి వెళ్లారు. క
మరోవైపు ఐటీ అధికారులు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు ఆయా సినిమాలకు పెట్టిన పెట్టుబడులు, ఆదాయాలపై ఆరాతీస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.