టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై థ్యాంక్యూ (Thank You)చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జులై 22న గ్రాండ్గా విడుదల కానుంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాగచైతన్య (Naga Chaitanya), రాశీఖన్నా (Raashi Khanna), మాళవికా నాయర్, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇవాళ చిత్రయూనిట్ మీడియాతో ముఖాముఖిలో పాల్గొన్నది. ఈ సందర్భంగా సినిమా టికెట్ల ధరలపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్, వైజాగ్ సిటీల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.200 (జీఎస్టీతో కలిపి)గా ఉంటుందని చెప్పాడు. రాబోయే కాలంలోస్టార్ హీరోలు, హై బడ్జెట్ సినిమాలు కాని వాటికి ఇవే ధరలు ఫిక్సవుతాయన్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతున్నట్టు సమాచారం.
ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బీవీఎస్ రవి కథనందిస్తుండగా..లెజెండరీ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్కు మంచి స్పందన వస్తోంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని ధీమాగా ఉంది చిత్రబృందం.