Pushpa 3 | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ పుష్ప ది రైజ్(Pushpa the Rise) చిత్రానికి సీక్వెల్గా ఈ చిత్రం రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2024 ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే పుష్ప ది రైజ్(Pushpa the Rise) సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను, ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లిన అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్పై స్పందించారు.
ఈ చిత్రం ప్రదర్శన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. హలీవుడ్ ప్రేక్షకులు పుష్ప 2 చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలనుకుంటున్నా.. ఎందుకంటే ఇక్కడి వారు ఎలాంటి సినిమాలు చూస్తారో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. ఇక రాబోయే రోజుల్లో ‘పుష్ప 3’ కూడా ఉండవచ్చు. ఈ సినిమాను మార్వెల్, డిసీ లా ఒక ఫ్రాంచైజీలా తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.