స్వతహాగా అందగత్తెయిన ప్రియాంక అరుళ్ మోహన్ డీ గ్లామరైజ్డ్గా కనిపించడం ఆమె అభిమానులను కాస్త బాధించే అంశమే. అయినా ప్రెస్టీజియస్ సినిమాలో మంచి పాత్ర లభిస్తే ఏ ఆర్టిస్టయినా ఎందుకు వెనకాడుతారు?. ధనుష్ కెరీర్లో అత్యంత భారీగా రూపొందుతున్న ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రం కోసం ఆమె డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఆమె పోర్షన్కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిన సందర్భంగా వర్కింగ్ పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్కు పాయింట్ బ్లాంక్లో గన్ గురి పెట్టి కనిపిస్తున్నది ప్రియాంక అరుళ్ మోహన్. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. 1930-40 మధ్య సాగే పీరియాడికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ఇది. ఇటీవలే ధనుష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డిసెంబర్ 15న సినిమా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు జి.శరవణన్, సాయి సిద్దార్థ్లు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా :సిద్దార్థ్ నూని, సంగీతం: జీవి ప్రకాశ్కుమార్.