Dhanush-Sekhar kammula Movie | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నాలుగు సినిమాలను రిలీజ్ చేశాడు. కాగా మరో రెండు సినిమాలు సెట్స్పైన ఉన్నాయి. అందులో ‘సార్’ మూవీ రిలీజ్కు సిద్ధంగాఉండగా, ‘కెప్టెన్ మిల్లర్’ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈయన మరో సినిమాను పట్టాలెక్కించాడు. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ సినిమా చేయనున్నట్లు గతంలోనే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు.
తాజాగా ఈ సినిమా హైదరాబాద్లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘లవ్స్టోరి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్పై సునీల్ నారంగ్, పుస్కూరి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్కు జోడీగా సాయిపల్లవి నటించనున్నట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పాటు అరుణ్ మాతేశ్వరణ్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది.
The Remarkable Moment is here for the Path Breaking Combo🌟
Superstar @dhanushkraja
Director @sekharkammula TRILINGUAL FILM Launched today on a Grand Note with a pooja ceremony🪔FILMING BEGINS SOON #NarayanaDasNarang @AsianSuniel @puskurrammohan @SVCLLP #AmigosCreations pic.twitter.com/7Ru0WXlPA5
— Sreedhar Sri (@SreedharSri4u) November 28, 2022