Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి కెప్టెన్ మిల్లర్ (Captain Miller). అరుణ్ మథేశ్వరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ధనుష్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట మంచి స్పందన రాబట్టుకుంటోంది. ధనుష్తోపాటు గ్లామర్ క్వీన్ ప్రియాంకా అరుళ్ మోహన్ ఇదివరకెన్నడూ కనిపించని నయా అవతార్లో అదరగొట్టబోతున్నట్టు తెలిసిపోతుంది.
కాగా ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించింది. ధనుష్ యాక్షన్ అవతార్ను చూసేందుకు రెడీగా ఉండండి.. రేపటి నుంచి బిగ్ స్క్రీన్స్లో కెప్టెన్ మిల్లర్ టీజర్ సందడి చేయనుందని తెలియజేస్తూ వీడియో విడుదల చేశారు. సౌతిండియా వ్యాప్తంగా 3500కిపైగా సెంటర్లలో కంటెంట్ లోడింగ్ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా.. టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన కెప్టెన్ మిల్లర్ లుక్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ మూవీ మూడు పార్టులుగా రాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Get ready to experience the pulsating @dhanushkraja ‘s Action Avatar, #CaptainMiller Teaser in big screens from tomorrow 🎉💥
Content loaded in 3500+ screens across South India ( Tamilnadu, Telengana, Andhra Pradesh , Karnataka & Kerala ) 🔥😎
15th DECEMBER Worldwide Release pic.twitter.com/CMdkaUuHWT
— Sathya Jyothi Films (@SathyaJyothi) August 9, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..