Dhanush-Aishwaryaa rajinikanth | కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య ఈ ఏడాది మొదట్లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2004లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఈ ఇద్దరూ 18ఏళ్ల తర్వాత వీరి వివాహా బంధానికి ఈ ఏడాది జనవరిలో ముగింపు పలకారు. హఠాత్తుగా వీరిరువురు విడిపోవడంతో అటు అభిమానులు ఇటు సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. డివోర్స్ అనౌన్స్మెంట్ తర్వాత దూరంగా ఉంటున్న ఈ జంట.. తాజాగా మళ్ళీ కలిశారు.
విడాకుల తర్వాత మొదటి సారి ధనుష్-ఐశ్వర్య కనిపించారు. ఈ కపుల్కు యాత్ర, లింగ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. తాజాగా పెద్ద కొడుకు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరిద్దరు హాజరయ్యారు. యాత్ర స్కూల్లో స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో పిల్లలతో కలిసి ఈ జంట ఫోటోలను దిగారు. ఈ ఫోటోలను ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్గా ఎంపికయ్యాడు’ అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ధనుష్తో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది ఇందులో ధనుష్, ఐశ్వర్య..తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
What a way to start the day ! Monday morning watching the Investiture Ceremony of school ,where my first born takes up oath as sports captain🎖#proudmommymoment #theygrowupsofast 🧡 pic.twitter.com/91GMsGsLhG
— Aishwarya Rajinikanth (@ash_rajinikanth) August 22, 2022