తమిళ అగ్రహీరో ధనుష్-ఐశ్వర్య దంపతులు విడాకులు రద్దు చేసుకోబోతున్నట్లు గత కొద్దిరోజులగా చెన్నై సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ జంట వేరుగా ఉంటున్నారు. ఇద్దరు పిల్లల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఇరు కుటుంబాలు సయోధ్యకు చేసిన ప్రయత్నాలు ఫలించాయని, ధనుష్-ఐశ్వర్య తిరిగి ఒక్కటి కాబోతున్నారని తెలిసింది. సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఈ జంటను తిరిగి కలిపేందుకు కృషి చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వందకోట్ల వ్యయంతో విలాసవంతంగా నిర్మిస్తున్న కొత్త ఇంటికి ధనుష్ తుదిమెరుగులు దిద్దుతున్నారని, జనవరిలో భార్యాపిల్లలతో గృహ ప్రవేశం చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఆ సమయంలోనే విడాకుల ప్రకటన రద్దు గురించి ధనుష్ అధికారికంగా వెల్లడిస్తారని తెలిసింది.