ఒకప్పుడు కథానాయికగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా మారి వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తుంది. చివరిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే చిత్రం నిర్మించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరోనా వలన ఆగిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలైంది.
అయితే ఇప్పుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఛార్మి ఓ మూవీ చేసే ఆలోచనలో ఉందట. సంగీత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన దేవి ఇప్పుడు హీరోగాను సత్తా చాటాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. దేవి హీరోగా తెరకెక్కబోవు చిత్రం హర్రర్ డ్రామాగా ఉంటుందని, ఇందులో దేవి గెటప్ కూడా డిఫరెంట్గా ఉంటుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.ప్రస్తుతం దేవి శ్ర ప్రసాద్ పుష్ప చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.