ప్రభాస్ నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. కృతి సనన్ నాయికగా నటిస్తుండగా..సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. రామాయణ ఇతిహాస గాథ ఈ చిత్ర కథకు ఆధారం. టీ సిరీస్ సంస్థలో భూషణ్ కుమార్ నిర్మాణంలో దర్శకుడు ఓంరావత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్టులు ఉపయోగిస్తున్నారు.
2డీతో పాటు త్రీడీలోనూ సినిమాను విడుదల చేయనున్నారు. అమెరికాలో జరుపుతున్న ఈ త్రీడీ వెర్షన్ పనులు తుది దశకు వచ్చాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. మరోవైపు సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్రబృందం మొదలుపెట్టబోతున్నది. దసరా పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ను విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రభాస్ స్వయంగా విడుదల చేయనున్నారట.