నాగలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై రవీంద్ర గోపాల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘దేశం కోసం భగత్సింగ్’. రాఘవ, మనోహర్, జీవా, సూర్య, సుధ, ప్రసాద్ బాబు ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా రవీంద్ర గోపాల మాట్లాడుతూ…‘సామాజిక స్పృహతో నేనీ చిత్రాన్ని రూపొందించాను. 1947 నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో 14 మంది స్వాతంత్య్ర సమరయోధుల పాత్రలను పోషించాను. ఈ చిత్రంతో మా అబ్బాయిని ఆజాద్ చంద్రశేఖర్గా పరిచయం చేస్తున్నాను. దేశం కోసం పోరాడిన ఎంతోమంది యోధుల్లో భగత్సింగ్ను ప్రధానంగా ఎంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుంది’ అన్నారు.