బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో తన ప్రేమాయణం గురించి పెదవి విప్పింది ఢిల్లీ ముద్దుగుమ్మ కియారా అద్వాణీ. తన లవ్ఎఫైర్ గురించి ఎప్పుడు ప్రశ్నించినా సమాధానం దాటవేసే ఈ అమ్మడు ‘కాఫీ విత్ కరణ్’షోలో తొలిసారి సిద్దార్థ్ మల్హోత్రాతో తన అనుబంధం ఎలా మొదలైందో వివరించింది. కరణ్జోహార్ నిర్మించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్సిరీస్లో కియారా అద్వాణీ నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ సక్సెస్ పార్టీలో ఈ భామకు సిద్ధార్థ్తో తొలిసారి పరిచయం ఏర్పడిందట.
‘తొలి పరిచయంలోనే సిద్దార్థ్ వ్యక్తిత్వం నచ్చింది. ఆ తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. ‘షేర్షా’ చిత్రంలో కలసి నటించడంతో మా బంధం మరింత బలపడింది. సిద్దార్థ్ నా గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. బహుమతులు ఇచ్చే విషయంలో కూడా నా అభిప్రాయం తెలుసుకుంటాడు. నాకు నచ్చని ఏ వస్తువునూ అతను బహుమతిగా ఇవ్వలేదు’ అని కియారా అద్వాణీ చెప్పుకొచ్చింది. మరి మీ ఇద్దరి పెళ్లెప్పుడని కరణ్జోహార్ ప్రశ్నించగా..‘తప్పకుండా పెళ్లి చేసుకోవాల్సిందే. ఎప్పుడనే విషయంలో మాత్రం నాకు స్పష్టత లేదు. నా పెళ్లి వార్తను అందరి కంటే ముందే మీకు చెబుతా’ అని కియారా తెలిపింది.