సినీ సెలబ్రిటీలు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం అభిమానులు. ఈ విషయాన్ని కొందరు సెలబ్రిటీలు పదేపదే గుర్తు చేసుకుంటారు. అలానే ఎవరికైన ఆపదొస్తే సాయం చేయడంలో ముందుంటారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే సేవా కార్యక్రమాలలో ఎల్లప్పుడు ముందు ఉంటుందనే సంగతి మనందరికి తెలిసిందే.
తాజాగా యాసిడ్ దాడి బాధితురాలు బాల ప్రజాపతికి దీపికా రూ.15 లక్షల ఆర్ధిక సాయం చేసింది. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న బాల ప్రజాపతి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాలు పనిచేయని స్థితికి రావడంతో వాటిని మార్పిడి చేయాలని అందుకు 16 లక్షల రూపాయల వరకు అవసరం అవుతుందని అన్నారు
ఇందుకోసం యాసిడ్ బాధితుల కోసం పని చేస్తున్న చాన్వ్ ఫౌండేషన్ నిధుల సేకరణ ప్రారంభించగా, ఈ విషయం దీపికాకి తెలియడంతో ఆ ఫౌండేషన్కి దీపికా 15 లక్షల రూపాయల విరాళం అందించి మంచి మనసు చాటుకుంది. ఖాళీ కుదిరిన సందర్భంలో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుతూ అందరిలో అవగాహన పెంచుతుంటుంది దీపికా. ఇటీవల ఫ్రంట్లైన్ ఆర్టిస్ట్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారామె. దీని ద్వారా మానసిక ఒత్తిళ్లను బయటికి చెప్పించి.. వారికి నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది.