‘స్పిరిట్’ కథను లీక్ చేశారంటూ దర్శకుడు సందీప్రెడ్డి వంగా ఇటీవల ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. వ్యక్తి ఎవరో చెప్పకుండా ఆయన నర్మగర్భంగా పెట్టిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. ఇటీవల ‘స్పిరిట్’ సినిమా నుంచి నటి దీపికా పదుకోన్ని తప్పించిన నేపథ్యంలో.. ‘స్పిరిట్’ కథను ఆమే లీక్ చేసి ఉంటుందని, ఆమెను ఉద్దేశించే సందీప్ ఆ పోస్ట్ పెట్టారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక.. అక్కడి మీడియాతో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ‘జీవితంలో బ్యాలెన్స్డ్గా ఉండాలంటే నిజాయతీ ముఖ్యం. నేను దానికే విలువిస్తా. క్లిష్టపరిస్థితుల్లో నా మనసు చెప్పేదే వింటా. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటా. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటా. ఈ క్రమంలో నా నిజాయతీని మాత్రం విడిచిపెట్టను’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సందీప్రెడ్డి పోస్ట్కు కౌంటర్గానే అని పలువురు భావిస్తున్నారు.