యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్లో ప్రాజెక్ట్ కె ఒకటి. చివరిగా రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాల షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాతో బిజీ కాబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో భారీ సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లు వ్యయం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ప్రశాంత్నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందనుంది. ఇదిలా ఉంటే సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాలోను ప్రభాస్ నటించబోతున్నారు.
ప్రాజెక్ట్ కె చిత్ర షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో దీపికా హైదరాబాద్లో అడుగుపెట్టింది. డిసెంబరు 5 నుంచి దీపిక షూట్లో పాల్గొంటారని సమాచారం. 7న ప్రభాస్ కూడా షూట్లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ముంబై ఎయిర్పోర్ట్లో ఆమె దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హిందీ పరిశ్రమలో తనదైన సత్తా చాటిన దీపికకు తెలుగులో ఇదే తొలి చిత్రం. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. బిగ్ బి అమితాబ్ ఇందులో కీకల పాత్రలో కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ స్వరాలు అందిస్తున్నారు.