నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ‘యు.ఏ’ సర్టిఫికెట్ లభించింది. సింగరేణి నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గ్రామీణ యువకుడు ధరణి పాత్రలో హీరో నాని కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు మంచి స్పందన లభించింది. సింగరేణి దగ్గరలోని ఓ గ్రామంలోని రాజకీయాలు, అక్కడి ఆధిపత్యపు శక్తులతో హీరో ధరణి చేసే పోరాటం నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం ఆసక్తిని పంచింది. ‘ఎైట్లెతే గట్లాయే సూస్కుందాం’ అంటూ నాని చెప్పిన చెప్పిన డైలాగ్కు మంచి స్పందన లభించింది. నానిని ఇప్పటి వరకు చూడని సరికొత్త మాస్ కోణంలో ఆవిష్కరించే చిత్రమిదని, వెన్నెలగా కథానాయిక కీర్తి సురేష్ పాత్ర ప్రధానాకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్నందించారు.