స్వీయ దర్శక నిర్మాణంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్ కథానాయిక. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘ఓ డాలరు పిలగా..’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. లియోన్ జేమ్స్ సంగీతాన్నందించిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. పబ్ నేపథ్యంలో పాటను తెరకెక్కించారు. ఈ పాటలో విశ్వక్సేన్ లుక్స్ ైస్టెలిష్గా ఉన్నాయి. ‘ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. ముఖ్యంగా యూత్కు బాగా కనెక్ట్ అవుతున్నాయి’ అని చిత్రబృందం పేర్కొంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దినేష్ కె బాబు, సంభాషణలు: ప్రసన్నకుమార్ బెజవాడ, నిర్మాత: కరాటే రాజు.