తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలుగు నిర్మాతల మండలి (Telugu Film Producer Council) నూతన అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. జెమినీ కిరణ్పై 17 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ విజయం సాధించారు. మొత్తం ఓట్లు 1,134 ఓట్లు కాగా.. పోలైన ఓట్లు 677.
వీటిలో దామోదర ప్రసాద్కు 339 ఓట్లు పోలవగా.. జెమినీ కిరణ్కు 322 ఓట్లు వచ్చాయి. నిర్మాతల మండలి కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి, జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ ఎన్నికయ్యారు. ఈసీ మెంబర్లుగా దిల్ రాజు, దానయ్య, రామకృష్ణగౌడ్ విజయం సాధించారు.
నిర్మాతల మండలికి సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి. కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు. అయితే కొన్ని రోజుల క్రితం చిన్న నిర్మాతలు ఎన్నికలు నిర్వహించాలని ఆందోళన చేపట్టడంతో ఇవాళ హైదరాబాద్లో ఎన్నికలు నిర్వహించారు.