శ్రీముఖి, మనో, రాజారవీంద్ర, తనికెళ్లభరణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. గుడ్ ఫ్రెండ్స్ సినిమా, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్2 క్రియేటివ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇ.సత్తిబాబు దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ట్రైలర్ను రచయిత కోన వెంకట్ విడుదలచేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి’ అని ఆకాంక్షించారు. వైవిధ్యతను నమ్మి తాను చేసిన చిత్రమిదని మనో అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘భార్యలు తమను నిర్లక్ష్యం చేయడంతో ఓ ముగ్గురు భర్తలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది. శ్రీముఖి గ్లామర్, అభినయం ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు’ అని పేర్కొన్నారు. ముగ్గురు అంకుల్స్కు ఓ యువతికి మధ్య ఉన్న సంబంధమేమిటన్నది ఆకట్టుకుంటుందని శ్రీముఖి చెప్పింది. ఈ కార్యక్రమంలో శ్రీవాస్, బొడ్డు ఆదిత్య, రాజా రవీంద్ర, అనసూయ భరద్వాజ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.