కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ వారసుడు (Vaarasudu). వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళంలో వారిసు టైటిల్తో తెరకెక్కుతోంది. ఈ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ డిసెంబర్ 24న నిర్వహించబోతున్నారు మేకర్స్. కాగా ఈవెంట్కు వచ్చే ముఖ్యఅతిథికి సంబంధించిన వార్త ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
పవర్స్టార్ పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాబోతున్నాడని ఫిలింనగర్ లో జోరుగా ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు షూటింగ్తో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఇటీవలే హరీష్శంకర్తో సినిమా కూడా లాంఛ్ చేశాడు. పొలిటికల్ కమిట్మెంట్స్తో కూడా బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కల్యాణ్ చీఫ్ గెస్ట్గా రాబోతున్నాడన్న పుకార్లపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి మరి.
ఒకవేళ పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా రాబోయేది నిజమే అయితే విజయ్, పవన్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న వారసుడు ప్రాజెక్ట్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రకాశ్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగిబాబు, శరత్ కుమార్, జయసుధ, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ప్లే అందిస్తుండగా.. ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వారసుడు చిత్రాన్ని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు.