గతేడాది ఎఫ్ 3 సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టందుకున్నాడు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఓరి దేవుడా చిత్రంలో కీలక పాత్రలో కూడా మెరిశాడు. ఈ సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుంది. వెంకీ మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో స్పెషల్ రోల్ కూడా చేస్తున్నాడు. సల్లూభాయ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా వెంకటేశ్ హీరోగా చేయబోయే 75వ ప్రాజెక్ట్ (Venkatesh 75th Movie)పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. హిట్ 2 సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న శైలేష్ కొలను (Sailesh Kolanu)తో వెంకటేశ్ 75వ సినిమా ఉండబోతుందని తాజాగా ఓ న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. తాజా టాక్ ప్రకారం కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరవబోతుందట.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమా రాబోతుందని ఇన్ సైడ్ టాక్. శైలేష్ కొలను-వెంకటేశ్ క్రేజీ కాంబోపై వచ్చిన అప్డేట్ అఫీషియల్ కాకున్నా.. ఈ వార్తను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఒకవేళ ఇదే నిజమైతే ఎలాంటి జోనర్లో ఈ ఇద్దరి సినిమా ఉండబోతుందోనని ఆసక్తిగా చర్చించుకోవడం మొదలుపెట్టారు అభిమానులు.