వెంకటేశ్, పవన్ కల్యాణ్.. సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు. ఈ ఇద్దరూ గోపాలగోపాల చిత్రంలో కలిసి నటించిన విషయం తెలిసిందే. సిల్వర్ స్క్రీన్పై కలిసి నటించిన ఈ ఇద్దరూ బాక్సాఫీస్ వద్ద ఒకేసారి బరిలోకి దిగుతున్నారంటే ఎలా ఉంటుంది..? ఇప్పుడలాంటి వార్తే నెట్టింట హల్ చల్ చేస్తోంది. వెంకటేశ్ (Venkatesh) నటిస్తోన్న చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని హిట్ ఫేం శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు.
సైంధవ్లో శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేయబోతుందని మేకర్స్ ఇప్పటికే అప్డేట్ ఇచ్చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న మూవీ ఓజీ (OG). సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజా టాక్ ప్రకారం ఓజీ కూడా డిసెంబర్ 22న థియేటర్లలో సందడి చేయబోతుందట. ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద పవన్, వెంకీ ఫైట్ ఎలా ఉండబోతుందన్నది సర్వత్రా ఉత్కంఠ రేకెత్తించే విషయమే కదా.
సైంధవ్లో రుహానీ శర్మ, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.సైంధవ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సైంధవ్కు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఓజీలో గ్యాంగ్లీడర్ ఫేం ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కిస్తున్నారు. ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
సైంధవ్ గ్లింప్స్ వీడియో..