కమెడియన్ సత్య కథానాయకుడిగా రితేష్ రానా దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ‘జెట్లీ’. రియా సింఘా కథానాయిక. వెన్నెల కిశోర్ కీలక పాత్రధారి. చిరంజీవి(చెర్రీ), హేమలత పెద్దామల్లు నిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను విడుదల చేస్తున్నది.
శుక్రవారం ఈ సినిమా రిలీజ్ డేట్ని అధికారికంగా ప్రకటించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ‘జెట్లీ’ విడుదల కానున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో డైనమిక్గా నడుస్తూ వస్తున్న సత్య, వెన్నెల కిశోర్లను చూడొచ్చు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ సారంగం, సంగీతం: కాలభైరవ, నిర్మాణం: క్లాప్ ఎంటర్టైన్మెంట్.