Mayilsamy Passes away | ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. తారకరత్న మరణవార్తను మరువకముందే ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ప్రముఖ కోలీవుడ్ హస్యనటుడు మయిల్స్వామి కన్నుమూశాడు. ఆదివారం తెల్లవారుజామున మయిల్ స్వామి ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబసభ్యులు సమీపంలోని పోరూర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. మయిల్ స్వామి మరణంతో తమిళ ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్లు పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
మయిల్ స్వామి 1984లో ‘ధవని కనవుగల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే తన స్టైల్ కామెడీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అప్పటినుండి మయిల్స్వామి వెనుదిరిగి చూసుకోలేదు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో సుమారు 200 సినిమాలకు పైగా నటించాడు. గతేడాది వచ్చిన ది లెజెండ్ సినిమాలోనూ మయిల్స్వామి మంచి పాత్ర పోషించాడు. ఇదే కాకుండా గతేడాది ఆయన అరడజను సినిమాల్లో నటించాడు.