ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణకుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకంపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. హైదరాబాద్లో వేసిన ప్రత్యేక సెట్లో ఆగస్ట్ 5వరకు జరిగే ఈ షెడ్యూల్తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని చెబుతున్నారు. నాయకానాయికలపై కీలక ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు. 1980 దశకం నేపథ్యంలో యూరప్లో నడిచే వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజాహెగ్డే కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్లుక్, మోషన్పోస్టర్కు అద్భుతమైన స్పందన లభించింది. దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ‘సలార్’ ‘ఆదిపురుష్’ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.