Shekar Movie | యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం శేఖర్. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. కాగా చిత్రం విడుదలైన మూడవరోజే రాజశేఖర్, జీవితలకు షాక్ తగిలింది. ఈ చిత్ర ప్రదర్శనను ఆపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలను జారి చేసింది. విషయంలోకి వస్తే ఫైనాన్షియర్ పరందామ రెడ్డి ఈ చిత్రానికి ఫైనాన్షియర్గా పనిచేశాడు. కాగా తనకు ఇవ్వాల్సిన డబ్బులు జీవిత, రాజశేఖర్ ఇవ్వలేరని పరందామ కోర్టును ఆశ్రయించాడు. కోర్డు ఈయనకు ఇవ్వాల్సిన డబ్బులను డిపాజిట్ చేయాలని జీవిత, రాజశేఖర్ దంపతులకు గడువు పెట్టింది.
అయితే వీళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సినిమా ప్రదర్శన ఆపివేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో సినిమా ప్రదర్శితం ఆగిపోయింది. దీనిపై స్పందంచిన రాజశేఖర్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాడానికి ఎంతో కష్ట పడ్డామని.. ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని, కానీ, కొందరు తన సినిమాను కుట్ర ప్రకారం అడ్డకున్నారని ట్విట్టర్లో తెలిపాడు. మలయాళంలో సూపర్ హిట్టయిన జోసేఫ్ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. ముందుగా ఈ చిత్రాన్ని ఒక యువ దర్శకుడు తెరకెక్కించాడు. ఒక రెండు, మూడు సీన్లను తెరకెక్కించిన తర్వాత ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. దాంతో జీవిత చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో మరోసారి మెగా ఫోన్ పట్టింది.
#Shekar pic.twitter.com/JipmYOnh57
— Dr.Rajasekhar (@ActorRajasekhar) May 22, 2022