అగ్రకథానాయకుడు చిరంజీవి జోరు మీదున్నారు. ‘ఆచార్య’ పూర్తి కాకుండానే కొత్త సినిమాను సెట్స్పైకి తీసుకొచ్చారు. ఈ చిత్రానికి మోహన్రాజా దర్శకుడు. ఆర్.బి.చౌదరి, ఎన్వీప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. తొలి షెడ్యూల్లో చిరంజీవిపై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మలయాళ చిత్రం ‘లూసిఫర్’ ఆధారంగా పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రాజకీయాల్లోని అవినీతిని పారద్రోలే డాన్గా, ప్రజలకు మంచి చేసే నాయకుడిగా భిన్న పార్శాల్లో చిరంజీవి పాత్ర సాగనుంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 153వ చిత్రమిది కావడం విశేషం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, సినిమాటోగ్రఫీ: నిరవ్షా, కళా దర్శకత్వం: సురేశ్ సెల్వరాజన్.