చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మోహర్ రమేష్ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేడు చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో చిరంజీవి ైస్టెలిష్ ట్రెండీ లుక్స్తో కనిపిస్తున్నారు. ‘ఇప్పటికే నలభైశాతం చిత్రీకరణ పూర్తయింది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తున్నది. మెగాభిమానులకు ఓ పండగలా ఉంటుందీ సినిమా’ అని నిర్మాత తెలిపారు.
ఇవాళ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న గాఢ్ ఫాదర్ చిత్ర టీజర్ను విడుదల చేశారు. రాజకీయ నేపథ్యమున్న యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా టీజర్ ద్వారా తెలుస్తున్నది. టీజర్లో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. మోహన్రాజా దర్శకుడు. ఈ సినిమా దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధమవుతున్నది.