టాలీవుడ్ (Tollywood) హీరో సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ (Republic) ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పవన్ కల్యాణ్. సినీ పరిశ్రమ చాలా సున్నితమైందని అన్నారు. సినీ పరిశ్రమకు ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తానని హెచ్చరిస్తూనే..తనపై ఉన్న కోపాన్ని సినీ ఇండస్ట్రీపై చూపించొద్దని వైఎస్సార్సీ నేతలకు సూచించారు.
కాగా పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు చిరంజీవి (Chiranjeevi) కు మింగుడు పడటం లేదని ఫిలింనగర్ సర్కిల్ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవలే చిరంజీవి నేతృత్వంలో కొందరు సినీ పెద్దలు ఏపీ సీఎం జగన్ (YS Jagan MohanReddy) ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ జగన్ కూడా టాలీవుడ్ సినీ పెద్దల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించినట్టు వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే త్వరలోనే ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త వస్తుందని అనుకుంటున్న తరుణంలో పవన్ ఇచ్చిన ప్రసంగంతో చిరు నిరాశచెందినట్టు టాక్ వినిపిస్తోంది.
బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలతో ఎలాంటి ఉపయోగం ఉంది..? మ మా సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఏపీ సీఎం జగన్, ఆయన బృందం కొన్ని అనుమానాలు లేవనెత్తితే వాటిని నివృత్తి చేశాం. త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందనుకుంటున్న తరుణంలో పవన్ కల్యాణ్ ప్రసంగం ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టైందని చిరంజీవి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తితో అన్నట్టుగా కథనం ఇపుడు టాలీవుడ్ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రీకరణ కోసం ఊటీలో ఉన్నారు.
Pooja Hegde| పూజాహెగ్డే, రష్మిక..ఇంతకీ ఇద్దరిలో ఎవరు..?
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!