Chiranjeevi | అగ్ర నటుడు చిరంజీవి కెరీర్ను మలుపుతిప్పిన చిత్రాల్లో ‘ఖైదీ’ (1983) ఒకటి. ఈ సినిమా ఆయనకు స్టార్డమ్ను తీసుకొచ్చింది. కమర్షియల్ కథానాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమా విడుదలై 40 ఏండ్లు అవుతున్న సందర్భంగా చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘నా జీవితంలోనే ‘ఖైదీ’ గొప్ప టర్నింగ్ పాయింట్లా నిలిచింది.
అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ఖైదీని చేసింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఈ సినిమా విడుదలై 40 సంవత్సరాలు అయిన సందర్భంగా చిత్ర దర్శకులు ఏ.కోదండ రామిరెడ్డిగారిని, నిర్మాతలు సంయుక్త మూవీస్ టీమ్ను, రచయితలు పరుచూరి సోదరులను, నా కో-స్టార్స్ సుమలత, మాధవిలను అభినందిస్తున్నాను. అంత గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు’ అని చిరంజీవి ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు.