దర్శకుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘రంగమార్తాండ’. రంగస్థల నటుల జీవితాల చుట్టూ అల్లుకున్న కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ‘నేనొక నటుడిని..’ అనే షాయరీకి స్టార్ హీరో చిరంజీవి డబ్బింగ్ చెప్పారు.
‘నేనొక నటుడిని, చమ్కీల బట్టలేసుకుని, అట్ట కిరీటం పెట్టుకుని, చెక్క కత్తి పట్టుకుని, కాగితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను..’. అంటూ సాగిన ఈ షాయరీని తాజాగా విడుదల చేశారు. లక్ష్మీ భూపాల దీన్ని రచించారు. ఈ షాయరీ ఒక నటుడి జీవితానికి అద్దం పట్టింది.