Yevam | యువ నటులు చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘యేవమ్’. నటుడు నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థ సి-స్పేస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చాందిని చౌదరి, ఆషురెడ్డిలతో పాటు భరత్రాజ్, కన్నడ రాయల్ స్టార్ యుగంధర్ ఫస్ట్ లుక్లను విడుదల చేయగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
తెలంగాణ బుర్రకథ స్టైల్లో ఈ టీజర్ను కట్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే వికారాబాద్ లో వరుసగా జరుగుతున్న హత్యలు, అక్కడ పోలీస్ గా జాయిన్ అయిన చాందిని ఏం చేసింది అనే ఆసక్తికర థ్రిల్లింగ్ అంశంతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ టీజర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
చాందిని చౌదరి, వశిష్ట సింహా, జైభారత్, ఆషురెడ్డి, గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కీర్తన శేషు, సినిమాటోగ్రాఫర్ ఎస్వీ విశ్వేశ్వర్, నీలేష్ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.