కొద్ది రోజులుగా టాలీవుడ్లో హాట్ టాపిక్గా ఇష్యూ ఏదైన ఉంది అంటే అది నాగ చైతన్య- సమంత డైవర్స్ విషయం అనే చెప్పాలి. ఎప్పుడైతే సమంత తన సోషల్ మీడియాలో అక్కినేని పేరు తొలగించిందో అప్పటి నుండి చైతూ- సామ్ డైవర్స్ విషయం హెడ్ లైన్స్లో నిలిచింది. తమ బంధంపై ఎన్ని పుకార్లు వచ్చినప్పటికీ ఇటు సమంత కాని అటు చైతూ కాని స్పందించలేదు.
తాజాగా చైతూ నటించిన లవ్ స్టోరీ చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇది ప్రతిఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సినిమా ట్రైలర్పై ప్రశంసలు కురిపించారు. సినిమా హిట్ అని కామెంట్లు పెడుతున్నారు. ఇక సమంత.. చైతూ ట్వీట్ని షేర్ చేస్తూ విన్నర్ అంటూ.. సినిమా టీం మొత్తానికి, సాయి పల్లవికి కంగ్రాట్స్ చెప్పింది. దీంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. చైతన్య పేరును ప్రస్థావించలేదు అంటే వీరి విడాకుల వ్యవహారం నిజమే అయి ఉంటుందని కొందరు చెప్పుకొచ్చారు.
అయితే కొద్ది సేపటి క్రితం సమంత ట్వీట్కి చైతూ స్పందించారు.థ్యాంక్స్ సామ్ అనే పోస్ట్ చైతూ తన ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో అభిమానులకి పుకార్లపై కొద్దిగా క్లారిటీ వచ్చింది. లవ్ స్టోరీ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో చైతూ పూర్తి క్లారిటీ ఇస్తాడని అభిమానులు భావిస్తున్నారు.లవ్ స్టోరీ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది.