ఉదృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో 84 బోట్లతో చేజింగ్ యాక్షన్ సీన్ అంటే ఏ రేంజులో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అది చూస్తుంటే గూస్బంప్స్ రావడం ఖాయం. ఇప్పుడు ఆ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని అంటున్నారు శ్రీదేవి సోడా సెంటర్ టీం. సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుండగా,ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
పలాస 1978 ఫేం కరుణ కుమార్ శ్రీదేవి సోడా సెంటర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ విజయ్ చిల్లా- శశిదేవిరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోదారి పరిసరాల్లో సినిమా చిత్రీకరణ జరిగింది. ఇందులో సుధీర్ బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపంచనున్నారు. పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తూనే మరోపక్క మ్యాచో బాడీతో సుధీర్ బాబు ఆకట్టుకోనున్నాడు.
ఈ సినిమాలో కీలకమైన బోట్ ఛేజింగ్ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయని యూనిట్ తెలిపింది. గోదావరి బ్యాక్ వాటర్స్ లో 84 బోట్లతో ఈ సన్నివేశాల్ని 15 రోజుల పాటు చిత్రీకరించారుట. ఈ సన్నివేశాల్లో సుధీర్ బాబు ఎలాంటి డూప్ లేకుండా నటించారు. బోట్ నడపడంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని మరీ సీన్ లోకి దిగారట. ఈ సన్నివేశాలకు సినిమాకే హైలైట్ అవుతాయని అంటున్నారు. ఈ సినిమాతోనైన సుధీర్ బాబు మంచి సక్సెస్ అందుకుంటాడా అనేది చూడాలి. కాగా, సుధీర్ బాబు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే